అంగరంగ వైభవంగా జాతీయ గీతాలపన, మహా ర్యాలీ.

– పాల్గొన్న జిల్లా ఉన్నతాధికారులు.
ఫోటో రైటప్: 1. జాతీయ గీతాలపన చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు.
2. మహా ర్యాలీ లో పాల్గొన్న కలెక్టర్, ఎమ్మెల్యే, ఇతర ఉన్నతాధికారులు.
బెల్లంపల్లి, ఆగస్టు13, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో శనివారం ఆజాదికా అమృత్ మహోత్సవ్ లో భాగంగా నిర్వహించిన మహా జాతీయ గీతాలపన, ర్యాలీ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. బెల్లంపల్లి సబ్ డివిజనల్ పోలీసుల ఆధ్వర్యంలో చేపట్టిన ఇట్టి కార్యక్రమం ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈసందర్భంగా ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ శాంతి, సామరస్యం వెల్లివిరియాలనే, సమైఖ్యత స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ కొనసాగించాలనే సంకల్పంతో చేపట్టిన ఈకార్యక్రమంలో చేపట్టిన బెల్లంపల్లి సబ్ డివిజనల్ పోలీసులను అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మాట్లాడుతూ ప్రజాస్వామ్మ వ్యవస్థ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడుతాయని, 25 వేల మందితో జాతీయ గీతాలపన కార్యక్రమం చేపట్టడం జిల్లాకే గర్వకారణం అన్నారు.
జాతీయ జెండాతో భారీ ర్యాలీకి ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం.
బెల్లంపల్లి పట్టణంలోని నెం 2 గ్రౌండ్లో చేపట్టిన 25000మంది తో సామూహిక జాతీయ గీతాలపన, మహర్యాలీ నిర్వహించడం ఇంటర్నేషనల్ వండర్ బుక్ అఫ్ రికార్డులో నమోదు అయింది. ఈ ర్యాలీ నెం.2 గ్రౌండ్ నుండి కొత్త బస్ స్టాండ్ వరకు కొత్త బస్ స్టాండ్ నుండి నెం.2 గ్రౌండ్ వరకు ర్యాలీ నిర్వహించడం వల్ల ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు అయింది. ఇట్టి అవార్డు ను వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కోఆర్డినేటర్ రంగ జ్యోతి చేతుల మీదుగా ఇన్చార్జి డిసిపి అఖిల్ మహాజన్ పోలీసు అధికారులతో కలిసి అందుకున్నారు.
ఉప్పొంగిన ఉత్సాహం, కదంతోక్కిన నవతరం… ఈతరం నోట వందేమాతరం..
బెల్లంపల్లి పట్టణంలో చేపట్టిన మహర్యాలీలో ఐక్యతాభావం పెంపొందించింది. ప్రజలలో ముఖ్యంగా యువతలో దేశభక్తి పెంపొందించడానికి, ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి ఇది ఎంతగానో దోహద పడేలా కార్యక్రమం జరిగింది. జాతీయ జెండా గౌరవం, విశిష్టత నేటి తరానికి ప్రజలకి తెలియజేయడం కోసం ఊరు,వాడ, పట్టణం, కాలనీ లను ఏకం చేస్తూ అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తూ అందరి భాగస్వామ్యంతో బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసులు భారీ ర్యాలీ నిర్వహించడం, అట్టి కార్యక్రమం చరిత్ర రికార్డుల్లో నమోదు కావడం బెల్లంపల్లి పట్టణానికి గర్వకారణం మారింది. ఈ ర్యాలీలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకల విశిష్టతను చాటేలా అన్ని వర్గాలకు చెందిన ప్రజలు స్వచ్చందంగా హాజరై ఫ్రీడం ర్యాలీలో భాగస్వాములయ్యారు. గుండెల నిండా దేశ భక్తిని నింపుకుని విద్యార్థులు, యువతీ యువకులు విద్యార్థులు యువకులు , అన్ని వర్గాల వారు జాతీయ జెండాను చేత పట్టుకుని వందేమాతరం…, భారత్ మాతాకీ జై….అంటూ నినాదాలు కదంకదం కలుపుతూ ర్యాలీలో పాల్గొనడం జాతీయ సమైక్యతకు అద్దం పట్టేలా కొనసాగింది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, డీసీపీ అఖిల్ మహాజన్, జిల్లా అటవీ అధికారి శివాని డోన్ గ్రే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేణికుంట్ల ప్రవీణ్ కుమార్ బెల్లంపల్లి ఏసీపీ మహేష్, బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీస్ అధికారులు సిబ్బంది, మంచిర్యాల పట్టణ కౌన్సిలర్లు, మరియు ప్రజా ప్రతినిధులు వివిధ డిపార్ట్మెంట్ అధికారుల, స్వచ్ఛంద సంఘాలు, ఇతర కుల సంఘాలు, స్కూల్స్ విద్యార్థులు, యువత, ప్రజలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.