అంగరంగ వైభవంగా స్వతంత్ర భారత వజ్రోత్సవాలు
– మండల అంబేద్కర్ యువజన సంఘల అధ్యక్షుడు పరిగి అశోక్
చౌడాపూర్, ఆగస్టు 15( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వాతంత్రం కోసం పోరాడిన యోధులను స్మరించుకుంటూ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 75 వ స్వతంత్ర భారత వజ్రోత్సవాలను చౌడాపూర్ మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా దగ్గర మండల అంబేద్కర్ యువజన సంఘాల అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలను ఎంతో అంగరంగ వైభవంగా వివిధ యువజన సంఘాల నాయకులు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పార్టీలకు చెందిన నాయకులు మరియు యువజన సంఘాల నాయకులు, బందయ్యా,రాములు,విష్ణు, నర్సింలు,శ్రీకాంత్,కుమార్, విజయకుమార్,శరత్,పాండు నాయక్ మరియు విద్యార్థిని విద్యార్థులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
