అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను ప్రారంభించిన జడ్పీటీసీ నిత్యా నిరంజన్ రెడ్డి

మంచాల మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ నిధులు మరియు ఎంపిటిసి నిధులతో ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేసిన మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి ఈ సందర్భంగా లింగంపల్లి గ్రామంలో పర్యటించిన జడ్పిటిసి త్వరలో జిల్లా పరిషత్ నిధులు మంజూరు చేయించి విడతలవారీగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు, మంచాల మండలం అన్ని గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తున్నమని తెలిపారు, ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ జయానందం,సర్పంచ్ పెర్క వినోద మూర్తి,వార్డు మెంబర్లు ఐలయ్య, సుదర్శన్ రెడ్డి, కిష్టయ్య, గ్రామస్తులు శ్రీనివాసరెడ్డి, బూర శివగౌడ్, మహేష్, రాజిరెడ్డి, కాలనీ వాసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.