అందరికీ ఆదర్శప్రాయుడు వెలికట్ట ఎంపీటీసీ

వధూవరులకు జాతీయ జెండాతో శుభాకాంక్షలు
కొండపాక (జనంసాక్షి) ఆగస్టు 11 : జప్తి నాచారం గ్రామానికి చెందిన చెల్లారపు రామచంద్రారెడ్డి కుమార్తె వివాహానికి గురువారం వెలికట్ట గ్రామ ఎంపీటీసీ చింతల సాయిబాబా గౌడ్ హాజరై జాతీయ జెండాను వధూవరులకు అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పెండ్లికి ప్రతి ఒక్కరూ హాజరవుతారు కానుకలు సమర్పిస్తారు. వధూవరులను ఆశీర్వదిస్తారు అందుకు భిన్నంగా ఉండాలనే ఉద్దేశంతో 75వ స్వతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా వధూవరులకు జాతీయ జెండాను అందించి దేశభక్తి నెలకొల్పాలనే ఉద్దేశంతో జాతీయ జెండాను బహూకరించానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జప్తి నాచారం సర్పంచ్ ముస్త్యాల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.