అక్బరుద్దీన్కు అస్వస్థత
హైదరాబాద్,ఫిబ్రవరి 26(జనంసాక్షి):
ఎంఐఎం శాసనసభ్యుడు అక్బరుద్దీన్ ఓవైసీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను హైదరాబాద్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వివాదాస్పద వ్యాఖ్యల కేసులో మంగళవారం అక్బరుద్దీన్ నిజామాబాద్ కోర్టుకు హాజరయ్యారు. ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేయనందున సమన్లు జారీ చేసి నప్పుడు కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ఆయన అస్వస్థతకు గురికాగా ఆస్పత్రికి తరలించారు.