అక్భర్ పేట-భూంపల్లి కుకునూరు పల్లి వాసుల చిరకాల వాంఛ నెరవేరింది
– సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు రుణపడి ఉంటాం.
– మెదక్ పార్లమెంటు సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి.
దుబ్బాక 27,జూలై ( జనం సాక్షి )
మండల కేంద్రం కావాలన్న అక్భర్ పేట-భూంపల్లి ఎక్స్ రోడ్, కుకునూర్ పల్లి మండలాల ప్రజల చిరకాల వాంఛ సీఎం కేసీఆర్, మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావుల చొరవతో నేడు నెరవేరిందని మెదక్ పార్లమెంటు సభ్యులు, జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జి కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. దుబ్బాక, మిర్డోడ్డి మండలాల నుండి 10 రెవెన్యూ గ్రామాలతో అక్భర్ పేట-భూంపల్లి ఎక్స్ రోడ్, అలాగే కొండపాక-జగదేవపూర్ మండలాల నుండి 13 రెవెన్యూ గ్రామాలతో కుకునూర్ పల్లిలు నూతన మండలాలుగా ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందన్నారు. ఈసందర్భంగా ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసమే సీఎం కేసీఆర్ కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేస్తున్నారని ఆయన తెలిపారు. నూతన మండల ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ , మంత్రివర్యులు తన్నీరు హరీశ్ రావు మండలాల ప్రజల పక్షాన ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Attachments area