అక్రమంగా గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న లారీ పట్టివేత
కుబీరు: అదిలాబాద్ జిల్లా భైంసా పట్టణం నుంచి కుబీరు మీదుగా మహారాష్ట్రలోని హిమాయత్నగర్ జిల్లా సోన్ పట్టణానికి అక్రమంగా గుట్కా ప్యాకెట్లను తరలిస్తున్న లారీని పోలీసులు పట్టుకున్నారు. స్వాధీన పరచుకున్న గుట్కా ప్యాకెట్ల విలువ సుమారు రూ.3లక్షలు ఉంటుందని ఎస్సై తోట సంజీవ్ తెలిపారు. వాహనానికి సరైన అనుమతి పత్రాలు లేకపోవడంతో పాటు వాణిజ్య పన్ను చెల్లించకపోవడంతో డ్రైవర్ మునువర్ను అదుపులోకి తీసుకొని రిమాండ్కు పంపినట్లు ఆయన చెప్పారు.