అక్రమంగా భూమి పట్టా చేసు చేసుకోవడానికి ఎత్నించిన నేరస్తులకు రిమాండ్. మరి కొందరి కొరకు గాలింపు

కోడేరు(జనంసాక్షి) జూలై 19 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల కేంద్రంలో అక్రమంగా భూమిని పట్టా చేసుకోవాలని చూసిన వారిపై తహసీల్దార్ బి మల్లిఖార్జున్ రావు, కోడేరు పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు, జోగి రాజు వెంకటేశ్వర రావు యొక్క 11.17 ఎకరాల భూమిని మోసపూరితంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చూసీన నేరస్థులు A1. చల్లా నాగేశ్వర్ రెడ్డి , తో పాటు 8 మంది ఇతరుల సహకారముతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని అనుకొని ప్లాన్ చేయగా వెంకటేశ్వర రావు బందువుల ఫిర్యాదుతో తహసీల్దార్ రిజిస్ట్రేషన్ ను ఆపినాడు. అట్టి విషయములో నేరస్థులను A1 గా చల్లా నాగేశ్వర్ రెడ్డి & A6 నల్లవెల్లీ శివకుమార్ తండ్రి నర్సింహ గ్రామం కొడేరు లను ఈ రోజు రిమాండ్ కు పంపించడమైనదని ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు.అదేవిధంగా మిగతా నేరస్థుల కోసం గాలిస్తున్నామని ఎస్సై కృష్ణ ఓబుల్ రెడ్డి తెలిపారు