అక్రమ కలప స్వాధీనం

 

 

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌30(జ‌నం సాక్షి): అక్రమంగా తరలిస్తున్న కలపను ఫారెస్ట్‌ అధికారులు పట్టుకున్నారు. జిల్లాలోని అశ్వారావుపేట మండలం నందిపాడు వద్ద జిట్రేగు దిమ్మలను వ్యాన్‌లో అక్రమంగాతరలిస్తుండగా అధికారులు పట్టుకున్నారు. వరంగల్‌ నుంచి ఆంధ్రా ప్రాంతానికి కలపను తరలిస్తూ ఫారెస్ట్‌ అధికారుల తనిఖీతో దొరికిపోయారు. కలపను తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.