అడెల్లి అమ్మవారికి…చేనేత పట్టు చీరెను సమర్పించిన పద్మశాలీలు

 

సారంగాపూర్ సెప్టెంబర్ 2 , జనం సాక్షి..,
మండలం లోని సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం అడెల్లి మహా పోచమ్మ అమ్మవారికి ఆదివారం గంగనీళ్ల జాతర
సందర్భంగా ఉదయం ఆరుగంటలకు అమ్మవారికి పుట్టింటి చీరే.సారె గా పద్మ శాలి వంశస్థులు సమర్పించగా ఆలయ పూజరి శ్రీనివాస్ శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు.అందరూ సుఖ సంతోషాలుగా ఉండేలా చూడాలని అమ్మవారికి మ్రొక్కుకున్నారు. అనంతరం పద్మ శాలి సంఘం జిల్లా అధ్యక్షులు,నిర్మల్ మార్కెట్ చైర్మన్ చిలుక రమణ,మండల సంఘ అధ్యక్షులు సామల వీరయ్యలు మాట్లాడారు..
అడెల్లి పోచమ్మ పద్మశాలిలా ఆడబిడ్డగా.. ప్రతి యేటా ఆనవాయితీగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించడం జరిగిందన్నారు..ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మాదిరిగా తెలంగాణ రాష్ట్ర దేవాదాయశాఖ అధికారికంగా జాతర సందర్భంగా మొదటగా అమ్మవారికి పద్మశాలి వంశస్థులు చేనేత వస్త్రాలు సమర్పించేలా జి.ఓ ను విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ పద్మ, జిల్లా పద్మశాలి సంఘ సభ్యులు మండలంలోని ఆయా గ్రామాల పద్మ శాలి సంఘ సభ్యులు పాల్గొన్నారు.