అతిథి అధ్యాపకుల నియామకానికి ఆహ్వానం.

నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి: నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం పాలెం శ్రీ వెంకటేశ్వర ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 2023-2024 విద్యాసంవత్సరానికి డిగ్రీ విద్యార్థులకు భోధించేందుకు అతిథి అధ్యాపకులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులకు ఆహ్వానిస్తున్నామని కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.విద్యారాణి బుధవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. పొలిటికల్ సైన్స్ -1, కంప్యూటర్ సైన్స్-1, సంస్కృతం-1,బిఏ(ఎల్)తెలుగు-1, తెలుగు-1 పోస్టులకు గాను అర్హత కలిగిన అభ్యర్థులు తేదీ 21 శుక్రవారం సాయంత్రం 4 గంటల లోపు నేరుగా కళాశాలలో పూర్తి బయోడేటాతో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. పి.జి లో 50 శాతం పర్సెంటేజ్ తో పాటు పి.హెచ్ డి, నెట్, సెట్ , బోధనా అనుభవం కలిగిన వారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు.అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీని ఫోన్ ద్వారా తెలియజేస్తామని తెలిపారు.