అత్యాచార ఆరోపణల్లో వైదొలగిన బిషప్‌

కొచ్చి,సెప్టెంబర్‌15(జ‌నంసాక్షి): కేరళ నన్‌పై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జలంధర్‌ బిషప్‌ ఫ్రాంకో ములకల్‌ తన పదవి నుంచి వైదొలగారు. ఫాదర్‌ మాథ్యూ కొక్కండమ్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు. తన పరోక్షంలో డయాసిస్‌ పరిపాలకుడిగా ఫాదర్‌ మాథ్యూస్‌ వ్యవహరిస్తారని పేర్కొన్నారు.

అయితే ఆయన అధికారికంగా ఈ పదవికి రాజీనామా చేయలేదు. శనివారం విడుదల చేసిన ఓ అధికారిక సర్య్కులర్‌లో తన పరోక్షంలో డయాసిస్‌ అడ్మినిస్టేట్రర్‌గా ఫాదర్‌ మాథ్యూ కొక్కడమ్‌ను తాను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. కేరళలోని దర్యాప్తు అధికారి నన్ను తదుపరి వివరణ కోసం పిలిచే అవకాశం ఉందని ఈ సర్క్యులర్‌లో ఆయన పేర్కొన్నారు.