అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే డా.వి.యం.అబ్రహం

అలంపూర్ జనంసాక్షి (అక్టోబర్ 12)
అలంపూర్ మున్సిపాల్టీ కి చెందిన మాజీ ఆలయ ధర్మకర్త సారాయి నాగరాజు భార్య శాలమ్మ గత కొంత కాలం నుంచి అనారోగ్యంతోబాధపడుతు, కర్నూల్ లోని వి.ర్ . మల్టీ స్పెషల్టీ హాస్పటల్ లో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న అలంపూర్ శాసన సభ్యులు డా.వి.యం.అబ్రహం బుధవారం హాస్పిటల్ కి వెళ్లి శ్యామలమ్మ ను పరామర్శించి, అక్కడి వైద్యులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, వారికి సీఎం సహాయ నీది ద్వార సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.