అన్నాచెల్లెళ్ల ఆత్మీయతకు నిలువెత్తు రూపం రాఖీ పూర్ణిమ
శివ్వంపేట ఆగస్ట్ 12 జనంసాక్షి : అన్నా చెల్లెలు అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ అనురాగాలకు, ఆత్మీయతకు, అనుబంధాలకు నిలువెత్తు ప్రతి రూపమే ఈ రాఖీ పౌర్ణమి అని మన వేద ప్రవచనాలు చెబుతున్నాయి. మండల పరిధిలోని వివిధ గ్రామాలతో పాటు మండల కేంద్రమైన శివంపేటలో శ్రావణ శుక్రవారం పౌర్ణమి తిది రెండూ కలిసి రావడంతో మండల వ్యాప్తంగా ప్రజలందరూ ఆనందోత్సవాల మధ్య రాఖీ పౌర్ణమి వేడుకలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా అన్న చెల్లెలు అక్క తమ్ముళ్లు వారి మధ్య ఉన్న ప్రేమ అనుబంధాలను నెమరేసుకొని వారి ఆత్మీయతను చాటుకున్నారు. మండల కేంద్రమైన శివంపేటలో జడ్పిటిసి పబ్బా మహేశ్ గుప్తకు ఆయన నివాసం లో సోదరి రమాదేవి బొట్టు పెట్టి రాఖీ కట్టి హారతి ఇచ్చి, ఆశీర్వదించారు. అలాగే మండల పరిధిలోని గోమారం గ్రామంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్ర గౌడ్ కు ఆయన సోదరి కూడా రాఖీ కట్టి ఆశీర్వదించారు.
