అప్పుల భాదతో వ్యక్తి ఆత్మహత్య….

దౌల్తాబాద్, ఆగస్టు 24, జనం సాక్షి.
మండల పరిధిలోని దీపాయంపల్లి గ్రామానికి చెందిన నారెడ్డి రాంచంద్రం అనే రైతు అప్పుల బాధతో వ్యవసాయ పొలంలోని బావిలో పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మృతుని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గాలింపు చర్యల్లో స్థానిక ఎస్సై చైతన్య కుమార్ రెడ్డి, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ కుమార్, లీడింగ్ ఫైర్ మెన్ నర్సింలు, ఫైర్ మెన్ రాజు,ప్రవీణ్,నాగరాజు తదితరుల పాల్గొన్నారు.