అప్రమత్తత, ముందు జాగ్రత్త తో ఉండాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్
సంగారెడ్డి టౌన్ జనం సాక్షి
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అధికారులకు ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ నుండి కలెక్టర్ శరత్ అదనపు కలెక్టర్లతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కంటిన్యూగా పడుతున్న వర్షాలతో జిల్లాలో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ముందస్తు చర్యలు తదితర విషయాలపై జిల్లా అధికారులు, డివిజనల్, మండల స్థాయి అధికారులకు కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, కుంటలు, చెరువులు కాలువలు నిండు కుండను తలపిస్తున్నాయన్నారు.
ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా వారిని సంరక్షించాలని, అత్యవసర పరిస్థితుల్లో సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాటు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులకు సూచించారు.
ఇరిగేషన్ ట్యాంక్ లన్నింటిని ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలించాలన్నారు. 75% ఎస్ ఎఫ్ టి కెపాసిటీ ఉన్న చెరువులు, అలుగు పాడుతున్నవి,వంద శాతం సర్ ప్లస్ ఉన్న చెరువులను మండల స్థాయిలో తాసిల్దార్, పోలీస్ ,ఇరిగేషన్ అధికారులు గ్రామపంచాయతీ ప్రతినిధులు, కార్యదర్శితో కలిసి సంయుక్తంగా పరిశీలించాలని సూచించారు. ఇతర ట్యాంకుల ను పరిశీలించి నివేదిక ఇవ్వాలని, అదేవిధంగా సమస్యత్మకమైన వాటిని గుర్తించి వాటి వివరాలు, తీసుకున్న చర్యల నివేదికను ఇవ్వాలని,
గ్రామపంచాయతీ లలో ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీ, పట్టణ ప్రాంతాల్లో మునిసిపల్, రెవిన్యూ శాఖల అధికారులు లో లైన్ ఏరియా లను గుర్తించి తగిన ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
గ్రామపంచాయతీలలో నీటి ట్యాంక్ లలో క్లోరినేషన్ కచ్చితంగా జరగాలని, పారిశుద్ధ్య నిర్వహణ క్రమం తప్పకుండా సక్రమంగా జరగాలన్నారు. మురుగు కాలువలలో నీరు నిలవకుండా చూడాలని, ఆయిల్ బాల్స్ వేయాలని, పబ్లిక్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిని శానిటేషన్ చేసేలా చర్యలు చేపట్టాలని డి.పి. ఓ.కు సూచించారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి టాంటాం వేసి వారిని ఇతర సురక్షిత ప్రాంతంలో ఉండేలా చూడాలని తెలిపారు. అన్ని గ్రామ పంచాయతీలలో వాటర్ టెస్టింగ్ చేయించాలని చెప్పారు.
చేపల వేటకు వెళ్లే వారిని వెళ్ళవద్దని హెచ్చరించాలని, అదేవిధంగా గొర్రెలు ,మేకలను బయటకు తీసుకువెళ్ల వద్దని గొర్రె కాపరులకు సూచించాలని ఆయా అధికారులకు ఆదేశించారు.
కురుస్తున్న భారీ వర్షాలకు చెట్లు విరిగి కరంట్ స్తంబాల ఫై పడి పోల్స్ విరగడం, లైన్స్ తెగడం జరుగుతాయని, కరంట్ స్తంభాల వద్ద కానీ, కరంట్ తీగల కింద, ట్రాన్స్ఫార్మర్ల వద్ద ఉండకూడదని, అదే విదంగా బావులు వద్ద తడిసిన చేతులతో స్టాటర్ డబ్బాలు కానీ, మోటార్ సర్వీస్ వైర్ సరిచేయుట లాంటివి ప్రమాదకరమని రైతులను చైతన్య పరచాలని తెలిపారు. ఎలక్ట్రిసిటీకి సంబంధించిన డ్యామేజెస్ నివేదికను ప్రతిరోజు ఇవ్వాలని విద్యుత్ శాఖ ఎస్. ఈ.కి సూచించారు.
రోడ్లు, కల్వర్టుల పరిస్థితులను పరిశీలించి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని,
లో లెవెల్ బ్రిడ్జిల వద్ద ప్రమాద సూచికలు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారు సూచించారు.
వైద్య ఆరోగ్యశాఖ అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలన్నారు. అన్ని పిహెచ్సిలు, సబ్ సెంటర్లు, ఆశాలు, ఏ ఎన్ ఎం ల వద్ద అవసరమైన మందులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని,108 అంబులెన్స్ వాహనాలను ప్రాధాన్యత పరంగా ఆయా సెంటర్లలో అందుబాటులో ఉంచాలని డి ఎం అండ్ హెచ్ ఓ కు సూచించారు.
శిధిలావస్థలో ఉన్న పాఠశాలలను, హాస్టల్స్, రెసిడెన్షియల్ పాఠశాలను డి ఈ ఓ, సంబంధిత సంక్షేమ శాఖల అధికారులు తనిఖీ చేసి ప్రత్యామ్నాయ భవనాలను చూడాలని ఆదేశించారు.
జిల్లాస్థాయిలో కలెక్టరేట్లో రెవెన్యూ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్ (ఇంజనీరింగ్ ) డిపిఓ, మున్సిపాలిటీలు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్, వ్యవసాయ, ఉద్యాన, నీటిపారుదల శాఖలకు సంబంధించిన ఫిర్యాదులు/సమాచారం తెలియజేయడానికి (ఇంటిగ్రేటెడ్) సమీకృత కంట్రోల్ రూమ్ ( నం.08455-272233/276155)ను ఏర్పాటు చేశామని, ఆయా శాఖల సిబ్బంది 24 గంటలు మూడు షిఫ్టులలో అందుబాటులో ఉంటారని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్లు, రాజర్షి షా, వీరారెడ్డి, డి ఆర్ ఓ రాధిక రమణి నీటిపారుదల శాఖ ఎస్ ఈ మురళీధర్, వివిధ శాఖల జిల్లా అధికారులు,డివిజన్ అధికారులు, ఎంపీడీవోలు, , తదితరులు పాల్గొన్నారు.
