అబద్ధాలు చెప్పడంలో మోదీ దిట్ట – కేజీవ్రాల్‌

ఆంధప్రదేశ్‌కు ప్రత్యేక ¬దా, హావిూల అమలు కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన ధర్మ పోరాట దీక్షకు ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజీవ్రాల్‌ మద్దతు పలికారు. చంద్రబాబు దీక్షా శిబిరానికి వచ్చి ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేజీవ్రాల్‌ మాట్లాడుతూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఏపీకి ప్రత్యేక ¬దా ఇస్తామని తిరుపతి వెంకటేశ్వర స్వామి సాక్షిగా హావిూ ఇచ్చిన ప్రధాని మోదీ హావిూలను అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీని మించిన వారు లేరని కేజీవ్రాల్‌ దుయ్యబట్టారు. మోదీ ఒక పార్టీకి కాదు.. యావత్‌ దేశానికి ప్రధాని అన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారని ఎద్దేవా చేశారు. హక్కుల కోసం పోరాడితే సీబీఐ వంటి సంస్థలతో దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఏపీ ప్రజల కోసం చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటానికి ఆమ్‌ ఆద్మీ పార్టీ మద్దతుగా ఉంటుందని తెలిపారు.