అభివృద్దిని చూడలేని నేతలు

కాంగ్రెస్‌,బిజెపిల తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌21(జ‌నం సాక్షి): తెలంగాణలో నాలుగేళ్లలో అభివృద్ధి జరుగుతుంటే కళ్లుండి చూడలేని కాంగ్రెస్‌ బిజెపి నాయకులు విమర్శలు చేస్తున్నారని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఉత్తమ్‌కుమార్‌ , కిషన్‌రెలతీరు కళ్లుండీ చూడలేని కబోదుల్లా ఉందని ఎద్దేవా చేశారు. భూసర్వే, భూసార పరీక్షలు, రైతుబంధు, రైతుకు జీవితబీమా, ఉచిత విద్యుత్‌ లాంటి అద్భుత నిర్మాణాత్మక పథకాలతో రాష్ట్రం అన్నదాతల సంక్షేమ రాజ్యంగా వర్ధిల్లుతున్నదని అన్నారు. ఇతర రాష్ట్రాలు ఈ పథకాలు చూసిఆశ్చర్య పోతున్నాయని అన్నారు. రైతుపండించిన పంటలన్నీ ప్రభుత్వం మద్దతు ధరకే గ్రామాలకే వచ్చి కొంటుందని వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ రైతును రాజును చేసే దిశగా రాష్ట్రంలో అనేక చర్యలఉ తీసుకోవడంతో దిగుబడులు సాధించారన్నారు. విపక్ష నేతలు ఇకనైనా పద్ధతులు మార్చుకోవాలని సూచించారు. ఉత్తమ్‌కుమార్‌, కిషన్‌రెడ్డి ఉత్తరకుమారులని, వారిని ప్రజలు దూరం పెడితే మంచిదన్నారు.మరో 20 ఏళ్లు సీఎంగా కేసీఆర్‌ ఉంటారని టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఉత్సాహంగా పనిచేయాలన్నారు.