అమెరికా నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఎమ్మెల్యే ఆలన్నకు స్వాగతం పలికిన మదనాపురం నూతన పాలక మండలి కమిటీ

జనం సాక్షి కొత్తకోట,జూలై11,.                  దేవరకద్ర నియోజకవర్గంలో మొట్ట మొదటి సారి యువతకు వ్యవసాయ మార్కెట్ కమిటీ  ఛైర్మెన్ గా ,వైఎస్ ఛైర్మెన్ గా అవకాశం కల్పించినందుకు అమెరికా పర్యటన ముగించుకుని స్వదేశానికి విచ్చేసిన దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్ రెడ్డి కు నూతన పాలకమండలి సభ్యులు సన్మానించి అభినందించారు. హైదరాబాద్ లో తన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి  కాబోయే మదనపూర్ మండల మార్కెట్ కమిటీ ఛైర్మెన్ శ్రవణ్ కుమార్ రెడ్డి ,వైఎస్ ఛైర్మెన్ యాదయ్య యాదవ్, ఉమ్మడి జిల్లాల తెరాస అధికార ప్రతినిది గాడిలా ప్రశాంత్ నూతన పాలకమండలి సభ్యులతో పాటు దేవరకద్ర నియోజకవర్గ ఆలన్న యువసేన నాయకులు తమకు పదవులు అప్పజెప్పినందుకు ఎమ్మెల్యే ఆలన్నకు కృతజ్ఞతలు తెలియజేశారు.