అమ్మాయిలతో-తాగుబోతులు జారా జాగ్రత్త ..
అయినా గురువుగారు దారికి రాలేదు. పైగా ఎదురు దాడికి దిగాడు. అంతే మంధరే కోపం కట్టలు తెంచుకుంది. జుట్టు దొరక బుచ్చుకొని గవర్నమెంటు రైల్వే పోలీస్ స్టేషన్ దాకా ఈడ్చుకొచ్చి పోలీసులుకు అప్పగించేదాకా ఆ కోపం చల్లార లేదు. ఇంత జరుగుతున్నా చుట్టపక్కల ఉన్న జనం చోద్యం చూస్తూ నిలబడ్డారే తప్ప, ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయినా ఆమె ఒంటరిగానే పోరాడింది. రకరకాల ప్రశ్నలతో విసిగించిన రైల్వే పోలీసు అధికారులు చివరికి మంధరే ఫిర్యాదు స్వీకరించి, అతనిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
వాడు తాగి మత్తులో ఊగుతున్నాడు… పైగా కనీసం తాకడానికి భయపడేంత మురికి కంపు కొడుతున్నాడు.. నామీద దాడి చేస్తాడేమోనని భయం వేసింది కాసేపు. అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాను.. అంటూ చెప్పుకొచ్చింది మంధరే. ప్రతి అమ్మాయి ఇలాంటి విషయాల్లో మౌనంగా ఉండకూడదు.. ధైర్యంగా ఎదుర్కోవాలి..కచ్చితంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అంటూ సందేశమిచ్చిందీ ఈ ధీశాలి.