అయోధ్య సతీమణిని పరామర్శించిన సిపిఐ జిల్లా నాయకులు
పినపాక నియోజకవర్గం ఆగస్టు 20 (జనం సాక్షి): హైదరాబాద్ గమన్ హస్పటల్లో సి పి ఐ రాష్ట కమిటి సభ్యులు ,జిల్లా కార్యవర్గ సభ్యులు బొల్లోజు అయోద్య చారి సతీమణి అనారోగ్యంతో చికిత్స పోందుతున్న విషయం తెలుసుకున్న కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే సి పీ ఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కూనంనేని సాంబశివరావు శనివారం పరామర్శించారు. గత కొన్ని రోజులుగా సతీమణి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ గమన్ హస్పటల్ నందు కోలుకుంటుండగా ఆయన పరామర్శించి ఓదార్చి ధైర్యం చెప్పారు. గమన్ హస్పటల్ చైర్మన్ డాక్టర్ యర్రంశెట్టి నందకిశోర్ ను కలిసి అయోద్య సతీమణి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అయోద్య సమాజహితం కోసం ఎన్నో పోరాటాలు చేసి నిరుపేదల పక్షాన నిలబడిన గొప్ప మనిషి -అలాంటి నేత కుటుంబం ఆపదలో ఉందనే విషయం తెలిసి చాలా ఆవేదన చెందానని ఆమె త్వరగా కోలుకోవాలని అన్నారు. మంచి వైద్యం చేసి ఆమెను కాపాడిన గమన్ హస్పటల్ వైద్యులను ఆయన అభినందించారు. పరామర్శించిన వారిలో కూనంనేని సాంబశివరావు , రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు ,ఖమ్మం జిల్లా కార్యదర్శి ప్రసాద్ ఉన్నారు.