అయ్యప్ప నామస్మరణతో మారుమోగిన అయ్యప్ప దేవాలయం.

ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతులు.
ఎమ్మెల్సీ తనయుడు  రీనిష్ రెడ్డి చే 18 మెట్ల పడిపూజ.
తాండూరు డిసెంబర్ 18 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దంపతుల ఆధ్వర్యంలో తన ముద్దుల తనయుడు
రీనిష్ రెడ్డి చే అయ్యప్ప స్వామి మహా పడిపూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా ఆలయంలో కొలువుదిరిన అయ్యప్పస్వామి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తన ముద్దుల తనయుడు రీనిష్ రెడ్డి చే 18 మెట్ల పడిపూజ ఆధ్యాత్మిక కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం ఆలయ పరంగణంలో అయ్యప్ప స్వాములను దృష్టిలో ఉంచుకొని అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. పడిపూజ సందర్భంగా ఆలయానికి హాజరైన అయ్యప్ప స్వాములకు పాదపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ దర్మశాస్త అయ్యప్ప స్వామి అనుగ్రహంతో ప్రజలంతా సుఖసంతోషాలతో వర్థిల్లాలని వేడుకున్నామన్నారు, నియోజకవర్గం, జిల్లా మరింత అభివృద్దిలో ముందుకుసాగాలని,రాష్ట్రం నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు..అయ్యప్ప స్వామి పడిపూజ మహోత్సవ విజయవంతానికి కృషి చేసిన గురుస్వాములు, అయ్యప్ప స్వాములకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయ అర్చకులు ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కుటుంబ సభ్యులను వేదమంత్రోచ్ఛరణాలతో ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమళ్, నీరజ బాల్ రెడ్డి,మాజీ మున్సిపల్ చైర్మన్  కొట్రిక్ విజయ్ లక్ష్మి,,కౌన్సిలర్ లుశోభారాణి, మణ పురం రాము, ప్రవీణ్ గౌడ్,వెంకన్న గౌడ్, నాయకులు
మేఘనధ్ గౌడ్, పరిమళ,పిఎసిఎస్ చైర్మెన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,శ్రవణ్,అజయ్ ప్రసాద్, పట్లోళ్ళ బాల్ రెడ్డి, పట్లోళ్ళ  నర్సింహులు, శంకర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి,ప్రియాంక శ్రవణ్, నిరంజన్ రెడ్డి, రాజు పటేల్, గడ్డల రవీందర్,బి.రఘు, శ్రీకాంత్ రెడ్డి,సిద్దు అయ్యా, జగదీష్, తదితర నాయకులు, ముఖ్య  నాయకులు,సీనియర్ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు తదితరులు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.