అయ్యప్ప పూజలతో పల్లెల్లో ఆధ్యాత్మిక వాతావరణ : శ్రీరాములు అందెల

వీధివీధినా అయ్యప్ప భక్తుల భజనలు, పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందని బిజెపి నాయకులు అందేలా శ్రీరాములు యాదవ్ అన్నారు.     గుమ్మడవెల్లి గ్రామంలో కాకి సత్యనారాయణ గార్డెన్స్ లో జరిగిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీరాములును ఆకులమైలారం గ్రామకమిటీ సభ్యులు, కన్నెస్వామి
గొరిగె శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. గురుస్వాముల ఆశీస్సులు తీసుకున్న అందెల శ్రీరాములు… మాలధారణ చేసిన అయ్యప్ప భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దీక్షాకాలం పూర్తి చేసేలా హరిహరసుతుడి దీవెనలు ఉండాలని వేడుకున్నారు. ప్రతీ గ్రామం, వీధివీధినా అయ్యప్ప భక్తుల భజనలు, పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడుతుందన్నారు. హిందూ బంధువులందరూ ఎంతో పవిత్రమైన అయ్యప్ప స్వామి పూజల్లో పాల్గొని మానసిక ప్రశాంతతను పొందుతున్నారని కొనియాడారు. మహేశ్వరం నియోజకవర్గం సుభిక్షంగా ఉండేలా చూడాలని శబరిమలై వాసుడిని వేడుకున్నామని అందెల శ్రీరాములు చెప్పారు.
ఈ పూజాక్రతువులో ఎంపీపీ మంద జ్యోతిపాండు, గుమ్మడవెల్లి ఎంపీటీసీ రేఖా బాబురావు, ఉపసర్పంచి జీవితామహేందర్, సురేందర్ రెడ్డి, కొంతం జంగారెడ్డి, అంజయ్య, మల్లేష్ సహా బీజేపీ, బీజేవైఎం, అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.