అర్హులంతా ఓటరుగా నమోదు చేసుకోవాలి

పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఆదివారం బోథ్ మండలంలో పలు పోలింగ్ స్టేషన్లో ఓటర్ నమోదు ప్రక్రియతో పాటు, ఫారం 6ఫారం 7 ఫారం 8
పరిశీలించి  పలు సూచనలు చేశారు. బిఎల్ఓ లకు రెవెన్యూ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మండలంలో కొనసాగుతున్న ఓటరు నమోదు కార్యక్రమం పై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ అతికొద్దీన్ సర్పంచ్ సురేందర్ యాదవ్, రెవెన్యూ సిబ్బంది పలువురు దరఖాస్దారులు పాల్గొన్నారు