*అర్హులైన ప్రతి ఒక్కరికి అసరా పెన్షన్లు*

*ఎమ్యెల్యే పట్నం నరేందర్ రెడ్డి*
=============================
మద్దూర్ (జనంసాక్షి): నారాయణపేట జిల్లా మద్దూర్ మండల పరిధిలో అర్హులైన ప్రతి ఒక్కరికి  ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం రోజు ఆయన మద్దూరు, కొత్తపల్లి మండలాల్లో పర్యటించారు.రెండు మండలాలకు సంబందించిన 1848 ఆసరా పింఛన్లు, 88 కల్యాణ లక్మి చెక్కులు లబ్ధిదారులకు ఎమ్మెల్యే పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన   మాట్లాడుతూ గ్రామాల్లో అక్కడక్కడా కొంతమంది అర్హులు మిగిలిపోయిన వారందరికీ ఫించన్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో  అమలవుతున్న పతకాలు దేశానికే ఆదర్శంగా మారాయని తెలిపారు.రైతుల కోసం అమలు చేస్తున్న పతకాలను దేశంలోని వివిధ రాష్ట్రాల రైతు సంఘాల నాయకులు దేశమంతటా అమలు చేయాలని కోరుతున్నట్లు వివరించారు.ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి పతకాలను ప్రజలు సమర్థించాలని కోరారు.అలాగే  మద్దూరు,మండలములోని మోమినాపూర్,కొత్తపల్లి మండలము లోని ఆల్లిపూర్ గ్రామాలకు సంబందించిన పంచాయతీ కార్యదర్శులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలోఎంపీపీ విజయలక్ష్మి తహసీల్దార్ పాండు మరియు పలు శాఖల అధికారులతో పాటు మండలములోని  అన్ని గ్రామాల సర్పంచ్లు,ఎంపీటీసీ లు,మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి,మాజీ జెడ్పీటీసీ  సలీం,మరియు పార్టీ నాయకులు రాజ శేఖర్ రెడ్డి, బసప్ప,విరేష్ గౌడ్,శివకుమార్, హాన్మి రెడ్డి, వివిధ గ్రామాలకు చెందిన నాయకులు ప్రజలు  పాల్గొన్నారు.