అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎల్ బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుదీర్ రెడ్డి

ఆ ర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలి: ఎల్ బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుదీర్ రెడ్డి  స్పష్టం చేశారు. శుక్రవారం నాడు  కళ్యాణ లక్ష్మీ  షాధి ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎల్.బి.నగర్ శాసనసభ్యులు శ్రీ దేవిరెడ్డి సుదీర్ రెడ్డి గారు తన కార్యాలయంలో పలువురికి చెక్కులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి గారు మాట్లాడుతూ.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఆర్థికంగా ఆసరా లభిస్తుంది అని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరు ప్రభుత్వ పథకాలు పొందాలని కోరారు.బడుగు,బలహీనవర్గాల పేదల కోసం ఈ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలుచేస్తుంది అని తెలిపారు.మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గింది అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో 159 మందికి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో ఎమ్మెల్సీలు ఎగ్గే.మల్లేశం,దయనంద్ గుప్తా,ఆర్.డి.ఓ.సురేష్ కుమార్,సరూర్ నగర్ ఏం.ఆర్.ఓ.జయశ్రీ,ఉప్పల్ ఏం.ఆర్.ఓ.గౌతమ్ మరియు రెవెన్యూ అధికారులు,లబ్ధిదారులు పాల్గొన్నారు.