అలరించిన భక్తి సంగీత విభావరి

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి అక్టోబర్ 7
  వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఇటీవల జరిగిన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ 22వ వార్షిక బ్రహ్మోత్సవాల్లో నిర్వహించిన భక్తి సంగీత విభావరి భక్తులకు,  ప్రేక్షకులకు ఎంతగానో అలరించిందని నిర్వాహకులు వెంకట సత్య కుమార్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈ కార్యక్రమం సుమారు రెండు గంటల పాటు కొనసాగిందని అన్నారు. 15 నుంచి 20 వరకు భక్తి పాటలు ఆలపించి భక్తులను, ప్రేక్షకులను మైమరిపించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో రీథం ప్లేయర్ (తబలా) మహమ్మద్ ఖాన్ గాయకులు లక్ష్మణ్, విఠల్, శ్రీలేఖ, శ్రీకాంత్, శ్రీనివాస్, కీబోర్డ్ ప్లేయర్ లాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారని చెప్పారు. భక్తి సంగీత  విభావరి లో ఆలోచించిన పాటలు ఎంతగానో ఆకట్టుకునేయని బ్రహ్మోత్సవాలు నిర్వాహకులు లక్ష్మీనారాయణ కొనియాడినట్లు వెంకట సత్య కుమార్ తెలిపారు. ప్రేక్షకులు భక్తుల ఆధారాభిమానాల మేరకు మరిన్ని భక్తి సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.