అల్లాపూర్ లో జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బాబు మోసెస్.

మర్పల్లి, అక్టోబర్ 15 (జనం సాక్షి) ప్రధానమంత్రి అనుసుచితి అభ్యుదయ యోజన కార్యక్రమం ద్వారా ఎస్సీ కుటుంబాలకు జీవోనోపాధి కల్పించనున్నట్లు వికారాబాద్ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్  బాబు మోసెస్  తెలిపారు. ఈ మేరకు శనివారం మర్పల్లి మండలంలోని కోత్లాపూర్  గ్రామపంచాయతికి అనుబంధ గ్రామమైన అల్లాపూర్ గ్రామంలో వ్యవసాయ అనుబంధ అభివృద్ధి, అవసరానికి  సంబంధించిన ప్రాథమిక సమాచారం సేకరించారు.  ఈ సందర్భంగా బాబు మోసిన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా ప్రధానమంత్రి అను సుచితి అభ్యుదయ యోజన కార్యక్రమం కింద ఎస్సీలకు జీవనోపాధి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, ఎంపీడీవో జగన్నాథ్ రెడ్డి, కోత్లాపూర్ గ్రామ సర్పంచ్ ప్రభాకర్, ఉప సర్పంచ్ రాములు, సీనియర్ నాయకులు  రమేష్, వార్డు మెంబర్లు ప్రకాష్, విట్టల రావులతో పాటు చంద్రయ్య విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.