అవినీతి మంత్రులపై సీఎం నిర్ణయం తీసుకోవాలి :వీ హెచ్‌

న్యూఢిల్లీ : కేంద్రంలో అవినీతి ఆరోపణలు వచ్చిన మంత్రులను కాంగ్రెస్‌ అధిష్ఠానం పక్కనబెట్టిందని సీనియర్‌ నేత వి. హనుమంతరావు అన్నారు. అవినీతిని నిర్మూలించడం వల్లే కర్ణాటకలో కాంగ్రెస్‌కు ప్రజలు పట్టం కట్టారని ఆయన ఢిల్లీలో చెప్పారు. సోరియాగాంధీ నిర్ణయం తీసుకున్నట్లే రాష్ట్రంలో అవినీతి మంత్రులపై సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి నిర్ణయం తీసుకోవాలని కోరారు.