అసెంబ్లీ ఇంచార్జ్ అడ్వొకేట్ కొయ్యల శ్రీనివాసులు ఆధ్వర్యంలో మునుగోడు బయల్దేరిన బీఎస్పీ శ్రేణులు.

 

అచ్చంపేట ఆర్సీ, అక్టోబర్ 09(,జనం సాక్షి న్యూస్ ) : నియోజకవర్గ పరిధిలోని బీఎస్పీ నాయకులు మునుగోడు ఉప ఎన్నికల ప్రచారం కోసం అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జి అడ్వొకేట్ కొయ్యల శ్రీనివాసులు బయలుదేరారు. బహుజన సమాజ్ పార్టీ అభ్యర్థి ని గెలిపించడమే ధ్యేయంగా నల్లమల్ల ప్రాంతం నుండి బహుజన సమాజ్ పార్టీ నాయకులు అడ్వకేట్ కొయ్యల శ్రీనివాసులు వివరాలు వెల్లడిస్తు.. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండల బాధ్యతలు తనకు అప్పగించారని, ఇందులోభాగంగా నలమల ప్రాంతం నుండి బీఎస్పీ ముఖ్య నాయకులు కార్యకర్తల తో కలిసి
75 సంవత్సరాలుగా భారత దేశ రాజకీయాలలో అగ్రవర్ణ రాజకీయాల పాలన వలన , పేదోడు పేదోడుగానే ధనవంతుడు ధనవంతుడుగా ఉన్నారే గాని కనీస మౌలిక సదుపాయాలైన ఆరోగ్యం, వైద్యం, ఆర్థిక ,నివాస సౌకర్యాలు లేని జీవితం నేటికి బహుజనులు గడుపుతున్నారని, బహుజనుల రాజకీయ ఆర్థిక స్వేచ్ఛ కోసం రాజకీయ మార్పు సామాజిక న్యాయమే ధ్యేయంగా బహుజన సమాజ్ పార్టీ పనిచేస్తుందని ,మునుగోడు ప్రజలు ఇచ్చే తీర్పు కోసం తెలంగాణ రాష్ట్రం ఎదురుచూస్తుందని తెలిపారు. దేశ జనాభాలో అధికంగా ఉన్న బహుజనులు తమ ఓటు హక్కు ద్వారా బహుజన సమాజ్ పార్టీని గెలిపించి తీరుతారని అన్నారు. బహుజన ప్రజానీకం నుండి స్వచ్ఛందంగా బిఎస్పీ పార్టీ ప్రచారంలో పాల్గొనడం ఆహ్వానించదగ్గ విషయమని వారన్నారు . కార్యక్రమంలో జిల్లా సీనియర్ నాయకులు ఎనుపోతుల ఆంజనేయులు ,పదర మండల ఆర్గనైజింగ్ సెక్రెటరీ రామలింగం, బల్మూరు మండల కన్వీనర్ బాబు ,,లింగాల మండల కన్వీనర్ మన్యం రాము , బల్ముర్ మండల నాయకులు మల్లేష్ ,పదరమండల అధ్యక్షులు ఎనుపోతుల కృష్ణ బల్మూరు మండల కన్వీనర్ పానుగంటి ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.