ఆకుపాముల వద్ద ఘోర ప్రమాదం

సూర్యాపేట(జ‌నం సాక్షి ): మునగాల మండలం ఆకుపాముల వద్ద ఘోర ప్రమాదం తప్పింది. కారును తప్పించబోయిన రాజధాని బస్సు డివైడర్ మీదకు దూసుకెళ్లింది. ఘటన సమయంలో బస్సులో 27 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. బస్సు ముందు భాగం స్వల్పంగా ధ్వంసమైంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. రహదారిపై ట్రాఫిక్ జామ్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.