ఆగస్టు 3న చలో హైద్రాబాద్ ను జయప్రదం చేయండి
వాల్ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ జడ్పీటీసీ కళావతి
చేర్యాల (జనంసాక్షి) జులై : 68 షెడ్యూల్ పరిశ్రమల కనీస వేతనాలు జీవోలను సవరించాలని బీడీ, హమాలీ, భవన నిర్మాణం, ట్రాన్స్పోర్ట్ రంగాల కార్మికులతో పాటు ఇతర కార్మికులు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 3న చలో హైదరాబాదును జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకురాలు దాసరి కళావతి పిలుపునిచ్చారు. బుధవారం చేర్యాల పట్టణ కేంద్రంలో పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా దాసరి కళావతి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధి గురించి ఉపాధి ఉద్యోగ కల్పనాల గురించి గొప్పలు చెప్పుతున్నది తప్ప అధికారంలో ఉన్న ఎనిమిది సంవత్సరాల కాలంలో చేసింది ఏమీ లేదని ఐదు సంవత్సరాలకు ఒకసారి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాల్సి ఉండగా ఏమాత్రం పట్టించుకోవడంలేదని, కనీస వేతనాలను అమలు చేయడం లేదని, పని గంటలను 8 నుండి 12 గంటలకు పెంచి కార్మికులపై భారాలు మోగుతున్నారని ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి కార్మిక హక్కులను సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఆగస్టు 3న సిఐటియు ఆధ్వర్యంలో చేపట్టిన చలో హైదరాబాద్ ను జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ రేపాక కుమార్, యాడారం బ్రహ్మయ్య, అంజయ్య, రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Attachments area