ఆటోబోల్తా పడి మహిళ మృతి

భద్రాద్రి కొత్తగూడెం,జూన్‌5(జనం సాక్షి): జిల్లాలోని మొండికుంట డికెఎల్‌ చౌరస్తాలో మంగళవారం ఉదయం రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఆటో వేగంగా వచ్చి బోల్తా పడడంతో ఘటనా స్థలంలోనే మొండికుంటకు చెందిన మహిళ మృతి చెందింది. ఈ ప్రమాదంతో మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. చిన్నారి పరిస్థితి విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఖమ్మంకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈఘటనతో మృతురాలి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.