ఆత్మరక్షణకోసమే కాల్పులు జరిపాం


` నాగాలాండ్‌ ఘటనపై అమిత్‌ షా ప్రకటన
` ఉద్రవాదుల అనుమానంతో ఆర్మీ కాల్పులు
` మరణించిన కుటుంబాలకు రూ. 11లక్షల ఎక్స్‌గ్రేషియా
` నాగాకాల్పులపై అట్టుడికిన పార్లమెంట్‌
` సైనిక చట్టం రద్దు చేయాలన్న ఓవైసీ
న్యూఢల్లీి,డిసెంబరు 6(జనంసాక్షి):నాగాలాండ్‌లో కూలీలపై ఆర్మీ కాల్పులు జరిపిన ఘటన పట్ల లోక్‌సభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటన చేశారు. మాన్‌లోని ఓటింగ్‌లో తీవ్రవాదుల కదలికలు ఉన్నట్లు ఆర్మీకి సమాచారం వచ్చిందని, ఆ సమయంలో అనుమానాస్పద ప్రాంతంలో సుమారు 21 మంది కమాండోలు ఆపరేషన్‌కు సిద్దమయ్యారని, అయితే అక్కడకు వచ్చిన వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించగా.. ఆ వాహనం ఆగకుండా వెళ్లిందన్నారు. దీంతో ఆ వాహనంలో తీవ్రవాదులను తరలిస్తున్నట్లు అనుమానించి ఆర్మీ కాల్పులు జరపాల్సి వచ్చిందని షా తెలిపారు. ఆ వాహనంలో ఉన్న 8 మందిలో 6 మంది కాల్పులకు బలైనట్లు ఆయన చెప్పారు. గాయపడ్డ ఇద్దర్ని సవిూపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి ఆర్మీ తరలించిందన్నారు. ఈ ఘటన తర్వాత గ్రామస్తులు ఆర్మీ యూనిట్‌ను చుట్టుముట్టి, రెండు వాహనాలు ధ్వంసం చేశారని, సైనికులపై తిరగబడ్డారని హోంమంత్రి చెప్పారు. గ్రామస్థుల తిరుగుబాటులో ఓ సైనికుడు మృతిచెందినట్లు ఆయన వెల్లడిరచారు. ఆత్మరక్షణ కోసం సైనికులు ఫైరిరగ్‌ జరిపారన్నారు. కాల్పుల వల్ల మరో ఏడు మంది పౌరులు మృతిచెందినట్లు షా వెల్లడిరచారు. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నా.. అదుపులోనే ఉందన్నారు. ఘటన జరిగిన ప్రాంతాన్ని డిసెంబర్‌ 5వ తేదీన నాగాలాండ్‌ డీజీపీ, కవిూషనర్‌ సందర్శించారన్నారు. ఆర్మీ కాల్పుల ఘటన పట్ల ఎఫ్‌ఐఆర్‌ రిజిస్టర్‌ చేశామన్నారు. కేసు విచారణ కోసం రాష్ట్ర పోలీసులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. నెల రోజుల్లోనే విచారణను పూర్తి చేయాలని సిట్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇదిలావుంటే నాగాలాండ్‌ ఘటనలో మరణించిన వారి కుటుంబాల కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించాయి. కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.11 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనుందని నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియూ రియో వెల్లడిరచారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా ఒక్కో మృతుడి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి నిఘా వర్గాల సమాచారం మేరకు భద్రతాబలగాలు ఆదివారం నాగాలాండ్‌లోని మోన్‌ జిల్లాలో సెర్చింగ్‌ చేపట్టాయి. ఈ క్రమంలో తారసపడిన కొంతమంది యువకులను చూసి ఉగ్రవాదులుగా పొరబడిన సైనికులు వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 13 మంది పౌరులు మరణించారు. అదేవిధంగా ఒక పోలీస్‌ కానిస్టేబుల్‌ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు నాగాలాండ్‌ ఫైరింగ్‌ ఘటనపై రాజ్యసభలో రభస చోటుచేసుకుంది. ఉదయం సభ ప్రారంభం కాగానే నాగాలాండ్‌ కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సభలో ప్రకటన చేయాలని ప్రతిపక్ష ఎంపీలు పట్టుబట్టారు. ఈ విషయమై తమ స్థానాల్లో లేచి నిలబడి నినాదాల చేశారు. దాంతో ఛైర్మన్‌ సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా.. ప్రతిపక్ష ఎంపీలు తమ పట్టువిడువలేదు. ప్రతిపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దాంతో ఛైర్మన్‌ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 12 గంటలకు సభ తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయ్యింది. నాగాలాండ్‌ ఫైరింగ్‌ కేంద్రం ప్రకటన చేయాల్సిందేని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభాపతి సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ ఇవాళ లోక్‌సభలో మాట్లాడారు. ఆర్డ్మ్‌ ఫోర్సెస్‌ స్పెషల్‌ పవర్స్‌ యాక్ట్‌(ఏఎఫ్‌ఎస్‌పీఏ) చట్టాన్ని తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. దేశంలోనూ ఇలాంటి రాక్షస చట్టం లేదన్నారు. నాగాలాండ్‌లో జరిగిన ఆర్మీ కాల్పుల ఘటనను ఖండిరచిన ఆయన.. హంతకులను ప్రాసిక్యూట్‌ చేసేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుందా అని ఆయన అడిగారు. అణిచివేతకు, ద్వేషానికి ఆఫ్సా సింబల్‌గా మారిందని ఆరోపించారు.