ఆదర్శ పాఠశాల విద్యార్థులు యోగాలో ప్రథమ స్థానం..
టేక్మల్ జనం సాక్షి ఆగస్టు 25 టేక్మాల్ మోడల్ స్కూల్ విద్యార్థులు సబ్ జూనియర్ బాలబాలికల విభాగంలో ప్రథమ స్థానం సాధించారు. చేగుంట మోడల్ స్కూల్లో బుధవారం జరిగిన జిల్లా స్థాయి పోటీల్లో బంగారు పతకం కె శైలజ, ద్వితీయ స్థానం వెండి పతకం పీ శైలజ, తృతీయ స్థానం బ్రాంజ్ మెడల్ ఎస్ వి శ్రీష, సబ్ జూనియర్ పురుషుల విభాగంలో ప్రథమ స్థానం గోల్డ్ మెడల్ జస్వంత్, రెండవ స్థానం సిల్వర్, మెడల్ మని తేజ, మూడో స్థానం బ్రాంజ్
మెడల్ సంపత్ రెడ్డి, జూనియర్ బాలుల విభాగంలో రెండవ స్థానం సిల్వర్ మెడల్ మహేష్, సీనియర్ విభాగంలో మొదటి స్థానం బంగారు పతకం కార్తీక్, రెండో స్థానం వెండి పతకం చందు సాధించారు.పాఠశాల ప్రిన్సిపాల్ కరుణాకర్ రెడ్డి తెలిపారు విద్యార్థులను ఉపాధ్యాయులు అశోక్, నాగరాజు, శ్రీధర్, మోహన్, శ్రీనివాస్ చారి, నాగేందర్, లీల, అరుణ తదితర ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు అనంతరం పాఠశాల ప్రిన్సిపాల్ కర్ణాకర్ రెడ్డి మాట్లాడుతూ వ్యాయామ ఉపాధ్యాయుడు నర్సింలు యోగాలో ఉత్తమ క్రీడాకారులుగా తయారు చేయడం జరిగిందని వీరు వచ్చే నెల సెప్టెంబర్ లో రాష్ట్రస్థాయిలో పాల్గొంటారని రాష్ట్ర స్థాయిలో కూడా మంచి నైపుణ్యం సాధించేలా తీర్చిదిద్దాలని అన్నారు.