ఆధిక్యంలో టీమిండియా

1469159382_virat-kohli-indiaఇంగ్లండ్తో జరుగుతున్న నాల్గో టెస్టులో టీమిండియా ఆధిక్యంలోని నిలిచింది. తొలుత ఇంగ్లండ్ ను తొలి ఇన్నింగ్స్లో 400 పరుగులకు కట్టడి చేసిన భారత్.. ఆ తరువాత మూడో రోజు ఆట ముగిసే సమయానికి తన మొదటి ఇన్నింగ్స్లో  ఏడు వికెట్ల నష్టానికి 451 పరుగులు చేసి పైచేయి సాధించింది. టీమిండియా ఆటగాళ్లలో ఓపెనర్ మురళీ విజయ్(136;282 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) శతకంతో ఆకట్టుకోగా, కెప్టెన్ విరాట్ కోహ్లి(147 బ్యాటింగ్;241 బంతుల్లో 17ఫోర్లు) మరోసారి బాధ్యతాయుతంగా ఆడాడు. ఈ జోడి మూడో వికెట్కు 116 పరుగులు జోడించి జట్టు పరిస్థితిని చక్కదిద్దారు. కాగా, జట్టు స్కోరు 262 పరుగుల వద్ద ఉండగా విజయ్ నిష్ర్రమించడంతో ఆపై స్వల్ప  వ్యవధిలో టీమిండియా కొన్ని కీలక వికెట్లను చేజార్చుకుంది. భారత్ ఆటగాళ్లలో కరణ్ నాయర్(13),పార్థీవ్ పటేల్(15),అశ్విన్ (0)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇంగ్లండ్ బౌలర్లలో అలీ, రషిద్,రూట్లకు తలో రెండు వికెట్లు లభించగా, బాల్ కు వికెట్ దక్కింది.

తాజావార్తలు