ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహయ నిధి

జహీరాబాద్ ఆగస్టు 6 (జనంసాక్షి)

ఆపదలో అండగా ముఖ్యమంత్రి సహయ నిధి ఎంతో పనిచేస్తుంది అని తెరాస సీనియర్ నాయకులు నామా రవికిరణ్ అన్నారు. శనివారం జహీరాబాద్ లో భాదితురాలి కుటుంబ సభ్యులకు రెండు లక్షల రూపాయల చెక్కు అందజేేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణం లోని శాంతినగర్ కు చెందిన అనిస్ బేగం తీవ్ర అనారోగ్యంతో
ఇబ్బంది పడుతు హైదరబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.దీంతో
చికిత్స కొరకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి అని
మృతురాలి కుటుంబ సభ్యులు ఆర్థిక సహయం కొరకు స్థానిక టి.ఆర్.ఎస్ నాయకులను కోరడం జరిగింది. కోరిన వెంటనే స్పందించి వారి వివరాలు రాష్ట్ర ఆర్థిక మరియు ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు దృష్టికి తీసుకెళ్లి మంత్రి గారి సహాయంతో మృతురాలి తల్లి , తండ్రులకు ముఖ్యమంత్రి సహయనిధి నుండి మంజూరు అయిన రెండు లక్షల రూపాయలు(2,00,000) చెక్కును టి.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు నామ రవికిరణ్ అందజేశారు.అనంతరం మృతురాలి తండ్రి బాబుమియ మాట్లాడుతూ ఆపదలో తమను అదుకున్న టి.ఆర్.ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కె.సి.ఆర్ కు జిల్లా మంత్రి వర్యులు హరీష్ రావు కు ,స్థానిక శాసన సభ్యులు మానిక్ రావుకు,టి.ఆర్.ఎస్ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ
కార్యక్రమంలో స్థానిక వార్డ్ మాజీ కౌన్సిలర్ మహమ్మద్ అబ్దుల్లా,టి.ఆర్.ఎస్ మాజీ పట్టణ అద్యక్షుడు మహమ్మద్ యాకూబ్ పాల్గొన్నారు.