ఆపదలో ఉన్నవారికి తన వంతు ఆర్థిక సాయం…

డాక్టర్ దూళ్ల పరశురాములు.
ఊరుకొండ, ఆగస్టు 16 (జనం సాక్షి):
ఆపదలో ఉన్న వారికి తమ వంతుగా ఆర్థిక సాయం అందించడంలో తాము ఎల్లప్పుడూ ముందుంటామని డాక్టర్ దూళ్ల పరశురాములు అన్నారు. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని రేవల్లి గ్రామానికి చెందిన ఏదుల బాల వెంకయ్య భార్య ఏదుల బసవమ్మ (56) అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని నియోజకవర్గ నాయకురాలు బాలత్రిపుర సుందరి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సానుకూలంగా స్పందించిన బాల త్రిపుర సుందరి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికీ రూ.5000/- ఆర్ధిక సహాయం అందించడం జరిగిందని పరశురాములు పేర్కొన్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన బసవమ్మ చనిపోవడంతో మృతురాలి కుమారుడు లింగమయ్యకు తమ వంతు ఆర్థిక సాయం అందజేయడం అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బొబ్బిలి సునిత సాంబశివుడు, మండల అద్యక్షులు ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శులు రాజేందర్ గౌడ్, పరుష రాములు, సీనియర్ నాయకులు మల్లేష్, అర్జున్, శివుడు, ముత్యాలు, అరుణ్, శివనాదు, దినేష్, సతీష్, మరియు సీనియర్ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, రేవల్లి నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.