ఆరాధ్య పేరుతో సేవాలు అదుర్స్
శివ్వంపేట ఆగస్ట్ 24, జనంసాక్షి :
నియోజకవర్గ పెయింటర్స్ అసోసియేషన్ నాయకుడు, జిల్లా ఆర్ధిక ప్రణాళిక సంఘం సభ్యుడు, స్థానిక జడ్పీటీసీ పబ్బా మహేష్ గుప్తా కూతురు ఆరాధ్య పుట్టినరోజు వేడుకల సందర్భంగా బుధవారం మండల కేంద్రమైన శివ్వంపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 200 మందికి నోటు పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు పంపిణీ చేశారు. అదేవిధంగా నర్సాపూర్ నియోజకవర్గ అసోసియేషన్ సభ్యులు భీమా అలాగే సంఘం రిజిస్ట్రేషన్ కోసం 20 వేల రూపాయలు తన సొంత నిధుల నుండి జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా సంఘం ఉపాధ్యక్షులు ఆశు బై కి అందజేశారు. ఈ కార్యక్రమంలో శివంపేట సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, పెద్ద గొట్టిముక్కల ఉప సర్పంచ్ నవీన్, లక్ష్మీ నరసయ్య, ఉప సర్పంచ్ పద్మా వెంకటేష్, యూత్ వింగ్ మండల ఉపాధ్యక్షుడు షేక్ అలీ, సయ్యద్ దావత్, సింహం, గౌరీ శంకర్, సద్దాం, హుస్సేన్, భాస్కర్, అంజి, నాగేష్ తదితరులు పాల్గొన్నారు.