ఆరుగురు పోలీసులపై సస్పెన్షన్‌ వేటు

చికాగో: కారులో వెళ్తున్న ఇద్దరు ఆఫ్రికన్‌-అమెరికన్‌ వ్యక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన ఆరుగురు పోలీసులను అమెరికా అధికారులు సస్పెండ్‌ చేశారు. ఓహయోలోని క్లెవెలాండ్‌లో 2012 నవంబరులో ఆరుగురు పోలీసులు కార్‌ ఛేజ్‌ కేసులో ఓ కారుపై 137 బుల్లెట్లతో కాల్చారు. దీంతో కారులో ఇద్దరు ఆఫ్రికన్‌-అమెరికన్లు టిమోతీ రస్సెల్స్‌, మలిస్సా విలియమ్స్‌ మృతి చెందారు. ఘటనపై విచారణ జరిపిన అధికారులు కాల్పులు జరిపిన ఆరుగురు పోలీసులు విల్‌ఫ్రెడో దియాజ్‌, బ్రైన్‌ సబోలిక్‌, ఎరిన్‌ ఓడెన్నిల్‌, మైకేల్‌ ఫెర్లే, క్రిస్‌ ఎర్గ్‌, మైకేల్‌ బ్రెలోలను ఉద్యోగాల నుంచి తొలగించారు.