*ఆరోగ్యమే మహాభాగ్యం – ఐటిడిఎ పిఓ వరుణ్ రెడ్డి*
*ఇంద్రవెల్లి మండలం వాల్కొండ గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహణ – ఉట్నూర్ ఎఎస్పి హర్షవర్ధన్*
*400 మంది గిరిజనులకు వైద్య సేవలు*
*జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపిన గ్రామ పెద్దలు.*
ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి :
మూడు రోజుల్లో 1200 మంది గిరిజనులకు వైద్యం సేవలు అందించిన అప్రీరొన్ సంస్థ “స్వాస్తీయ రథ్”*
*మొదటి రోజు 500 మంది నార్నూర్ మండలం ఖైర్ దాట్వా గ్రామం,రెండవ రోజు ఉట్నూరు మండలం దొంగ చింతల గ్రామం 300 మంది. మూడవరోజు ఇంద్రవెల్లి మండలం 400 మంది ప్రజలు వైద్య సేవలు స్వీకరించారు.*
శుక్రవారం ఇంద్రవెల్లి మండలం వాల్గొండ గ్రామం నందు జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకు, జిల్లా పోలీసులు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ మరియు అప్రిరోన్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ సహకారంతో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఐటిడిఏ పిఓ వరుణ్ రెడ్డి మరియు ఉట్నూర్ ఎఎస్పి హర్షవర్ధన్ ముఖ్య అతిథులుగా పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ఐటీడీఏ పీఓ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ గిరిజనులకు ఆరోగ్యం మరియు పిల్లల చదువు వ్యవసాయం చాలా ముఖ్యమైన అంశాలని వీటిని ఎల్లవేళలా కాపాడుతూ తమ జీవితాలను ఆనందంగా ఉంచుకోవాలని తెలియజేశారు. గ్రామాల నందు జ్వరం వచ్చినప్పుడు కచ్చితంగా దగ్గరలో ఉన్న వైద్యశాలను సంప్రదించి తగు మందులను తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హీరాపూర్, వడగం, పాతగూడ, బండ పాత గూడ, మేడిగూడ గ్రామాలకు చెందిన 400 మంది గిరిజనులు, మారుమూల ప్రాంతాల ప్రజలు పాల్గొని వైద్య సేవలు స్వీకరించారు. ఈ వైద్య శిబిరం నందు జనరల్ ఫిజిషన్స్, గైనకాలజీ, ఆప్తమాలజీ, ఆర్థోపెడిక్ లాంటి సేవలు అందించడానికి ఇంద్రవెల్లి, పిట్ట బొంగరం పీహెచ్సీలకు సంబంధించిన వైద్యులు, వైద్య సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్స్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఉట్నూరు ఎఎస్పీ హర్షవర్ధన్ మాట్లాడుతూ గిరిజనులకు పోలీసు వ్యవస్థ, పోలీస్ యంత్రాంగం ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని ఎటువంటి సమస్యలకైనా పోలీస్ స్టేషన్లో గాని, తమ అధికారులకు కానీ సంప్రదించవచ్చునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆపీరొన్ కంపెనీకి సంబంధించిన హాస్పిటల్ ఆన్ వీల్స్ స్వాస్తీయ రథ ద్వారా 120 రకాల టెస్టులు, 80రకాల మందులు వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఈ హాస్పిటల్ ద్వార నిన్న 300 మంది గిరిజనులు ఉట్నూర్ మండలము దొంగచింతల గ్రామం నందు వైద్య సేవలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అప్రిరోన కంపెనీ ఎండి శ్రీనివాస్, సీఈవో సుధాకర, ఉట్నూర్ సీఐ ఐ సైదారావు, ఇంద్రవెల్లి ఎస్ఐ సునీల్, పోలీసు సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.
