ఆర్టీఐ రక్షక్ యాదాద్రి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయంలో ఆర్టీఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఆత్మకూర్(ఎం) అక్టోబర్ 12 (జనంసాక్షి)సమాచార హక్కు చట్టం 2005 ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా యాదాద్రి జిల్లా స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టిఐ రక్షక్ వ్యవస్థాపక అధ్యక్షులు సతీష్ కుమార్ ఆవనగంటి హాజరవడం జరిగింది. బుధవారం రోజున సమాచార హక్కు చట్టం ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఆర్టిఐ చట్టం బలోపేతంకు  మెమొరండం ను ఆర్టిఐ రక్షక్ సొసైటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయంలో ఏవో కి వినతిపత్రం ఇవ్వడం జరిగింది సతీష్ కుమార్ మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం వచ్చి 17 సంవత్సరాలు  పూర్తయిన సందర్భంగా ప్రజలకు సమాచార హక్కు చట్టం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా చీఫ్ అడ్వైజర్ కల్లూరి నాగేష్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కళ్లెం ధర్మనీల నాగం మధు సూదన్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇప్పలపల్లి నరేందర్ జిల్లా ఉపాధ్యక్షులు భాష బోయిన లింగస్వామి జిల్లా కోఆర్డినేటర్ కోట సుధాకర్ ప్రధాన కార్యదర్శి లందగిరి సాయికుమార్  యాదాద్రి జిల్లా యూత్ అధ్యక్షుడు మేడి స్వామి భువనగిరి డివిజన్ అధ్యక్షులు పోతగల నరహరి చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు కొండ మల్లేష్ చౌటుప్పల్ మండల అధ్యక్షులు రోష నగరి యాదయ్య కార్యదర్శి జీనామోని బుగ్గ రాములు వలిగొండ మండల అధ్యక్షులు ఐత రాజు అశోక్ ఉపాధ్యక్షులు మహేష్ కె రాజు శ్రీనివాస్ రవి శ్రీనివాస్ ఆసీఫ్ తదితరులు పాల్గొన్నారు