ఆర్‌టీసీ ఉద్యోగులకు శుభవార్త

` 4.8 శాతం డీఏతో కలిపి వేతన చెల్లింపు
హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఉద్యోగులకు 4.8 శాతంతో డీఏను మంజూరు చేసింది. అక్టోబర్‌ వేతనంతో కలిసి డీఏ చెల్లించనున్నది. అలాగే, ఇప్పటి వరకు పెండిరగ్‌లో ఉన్న తొమ్మిది డీఏలను సైతం మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు అసెంబ్లీలో బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించి.. గవర్నర్‌ ఆమోదం కోసం పంపిన ప్రభుత్వం.. తాజాగా డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.