ఆర్విఎం అధికారులు తీరు మార్పుకోవాలి
ఖమ్మం, నవంబర్ 14 : రాజీవ్ విద్యామిషన్ అధికారుల బృందాలు పాఠశాలల సందర్శన, పరీక్షల సందర్భంలో అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని వారు పద్దతి మార్చుకోవాలని యూపిఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శుడు రాజశేఖర్, నరసింహరావు ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గుర్తించిన లోపాలను, లోటుపాట్లను ఉపాధ్యాయులకు వివరించి వాటిని అధిగమించేందుకు సూచనలు ఇవ్వాలన్నారు. ఆర్విఎం అధికారులు పక్షపాత వైఖరి,అవగాహన రాహిత్యంతో చేపడుతున్న సమీక్షలు వివాదాస్పదమవుతున్నాయన్నారు.