ఆర్ ఎఫ్ సి ఎల్ బాధితుల గోడు , రోదనలు టిఆర్ఎస్ కు కనబడడం లేదా ..?

ఎవర్ని కాపాడడానికి టిఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉంది..?
జనం సాక్షి,
ఆర్ ఎఫ్ సి ఎల్ ఆత్మహత్య బాధితుడు హరీష్ కుటుంబ పరామర్శనలో జిల్లా అధ్యక్షుడు గంగా డి కృష్ణారెడ్డి వ్యాఖ్యలు..

 

రామగుండం పెటిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ (ఆర్ ఎఫ్ సి ఎల్) బాధితుల గోడు, రోదనలు టిఆర్ఎస్ ప్రభుత్వానికి కనబడడం లేదా..? లేక అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రమేయం ఉందని టిఆర్ఎస్ ప్రభుత్వం మౌనంగా ఉందా స్పష్టం చేయాలని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శంకరపట్నం మండలం అంబాల్ పూర్ కు చెందిన ఆర్ ఎఫ్ సి ఎల్ కాంట్రాక్ట్ ఉద్యోగి హరీష్ ఆత్మహత్య చేసుకోవడంతో బాధిత కుటుంబాన్ని స్థానిక శంకరపట్నం మండల అధ్యక్షులు ఐలయ్య మరియు బిజెపి శ్రేణులతో కలిసి ఆయన పరామర్శించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ ఎఫ్ సి ఎల్ లో కాంట్రాక్టు ఉద్యోగుల పేరిట కోట్ల రూపాయల దందా కొనసాగిందని అనేకఆరోపణలు ప్రచారం జరుగుతుందన్నారు. ముఖ్యంగా రామగుండం కు చెందిన అధికార పార్టీ ప్రజా ప్రతినిధి మధ్యవర్తులు దళారులను ఏర్పాటు చేసుకొని అనేకమంది బాధితుల దగ్గర డబ్బులు వసూలు చేసి కాంట్రాక్టు పద్ధతిలో ఆర్ ఎఫ్ సి ఎల్ ఉద్యోగం నాటకానికి తెరలేపారని ఆరోపణలు వచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం మున్నాల ముచ్చటగా మిగిలిపోయి బాధితులకు అరణ్య రోదన మిగిలిందన్నారు. చాలామంది బాధితులు ఎవరికీ చెప్పుకోలేకనరకయాతన అనుభవిస్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారని తెలిపారు. శంకరపట్నం మండలం అంబాలాపూర్ కు చెందిన హరీష్ కూడా అలాంటి పరిస్థితిఎదుర్కొని ఆత్మహత్య చేసుకున్నాడని వివరించారు.హరీష్ పలుమార్లు పోలీసుల దృష్టికి తన సమస్యను తీసుకువచ్చిన అలసత్వం ప్రదర్శించి , పట్టించుకోకపోవడంతో నేడు హరీష్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చినట్లు కనబడుతుందన్నారు. ఆర్ ఎఫ్ సి ఎల్ లో హరీష్ పొందిన కాంట్రాక్టు ఉద్యోగం వల్ల మోసపోవడంతోనే తనను మోసం చేసిన విధానాన్ని, అందుకు సంబంధించిన విషయాలను తెలియజేస్తూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవడం జరిగిందన్నారు. హరీష్ ఆత్మహత్య విషయంలో ప్రభుత్వం స్పందించాలని, ఆర్ ఎఫ్ సి ఎల్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించి, అధికార పార్టీకి సంబంధం ఉన్న ప్రజా ప్రతినిధిపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఆర్ ఎఫ్ సి ఎల్ కాంట్రాక్టు ఉద్యోగం పేరిట మోసపోయి ఆత్మహత్య చేసుకున్న హరీష్ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని, వెంటనే అతని కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించి , ఆత్మహత్య బాధితుని భార్యకు ఉద్యోగం కల్పించి , వారి పిల్లల చదువు బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి కళ్లెం వాసుదేవరెడ్డి రెడ్డి, గడ్డం నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, జిల్లా ఆఫీస్ సెక్రెటరీ మాడుగుల ప్రవీణ్, జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, , ఎంపిటిసి సభ్యులు అనిల్, దండు కొమురయ్య, నరేష్, కాంతాల రాజిరెడ్డి,మండ శ్రీనివాస్ రెడ్డి, సాగర్, నరేందర్ ,శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.