ఆశావర్కర్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే ప్రభుత్వం నెరవేర్చాలి. ఆశాలు చేస్తున్న దీక్షకు మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు..

ఏటూరునాగారం,
సెప్టెంబర్28(జనంసాక్షి)
మండల కేంద్రము లో దీక్ష చేస్తున్న ఆశా వర్కర్లకు, మద్దతు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల అధ్యక్షులు చిటమట రఘు మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ప్రజలు ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో ప్రాణాలకు తెగించి పని చేసిన ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఆశాలకు ఇస్తున్న పారితోషకాన్ని రూ 18,000 లకు పెంచి ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.
ఆశాలకు పిఎఫ్, ఇఎస్ఐ,ఉద్యోగ భద్రత కల్పించాలి.
ఆశాలకు హెల్త్ కార్డులు ఇవ్వాలి.
ప్రమాద బీమా సాకార్యం రూ 5 లక్షలు ఇవ్వాలని ఇటువంటి అనేక న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని లేని యెడల దశల వారీగా ఉద్యమ కార్యాచరణ కాంగ్రెస్ పార్టీ పక్షాన తీసుకొని వారికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నాయిగూడెం జెడ్పిటిసి నామ కరంచంద్ గాంధీ,బ్లాక్ ప్రధాన కార్యదర్శి వావిలాల నర్సింగావు,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య, యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ గౌస్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ దొంగిరి మధు, ఈసం యాదయ్య,కూరపాటి వేణు, ఎల్లస్వామి,ఈసం రాజు, ఏర్మరెడ్డి రాజశేఖరరెడ్డి,తదితరులు పాల్గొన్నారు.