ఆసరా పెన్షన్ల ఆలస్యంపై వృద్ధుల రాస్తారోకో

వనపర్తి అక్టోబర్ 10 (జనం సాక్షి)రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఇచ్చే ఆసరా పెన్షన్లు ఆలస్యం చేయడంతో అమరచింత ప్రధాన రహదారిపై వృద్ధులు రాస్తారోకో ధర్నా నిర్వహించారు.వృద్ధుల రాస్తారోకోకు సిపిఐ సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు వృద్ధులతోపాటు సిపిఐ సిపిఎం నాయకులు అబ్రహం, భాస్కర్, మల్లేష్, కుతుబ్, అజయ్, రమేష్, వెంకటేశులు రాస్తారోకో లో పాల్గొన్నారు పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం పెన్షన్లు పంపిణీ చేయకపోవడం పై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు వృద్ధులకు వెంటనే పెన్షన్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ ఆందోళన వల్ల రోడ్డుకిరువైపులా ట్రాఫిక్ జామ్ అయింది.