ఆస్తుల అటాచ్‌మెంట్‌పై విచారణ మార్చి 18న

ఢిల్లీ : రాంకీ, జగతి పబ్లికేషన్‌స కేసులో ఈడీ నోటీసుపై న్యాయప్రాధికార సంస్థ మార్చి 18న విచారణ జరపనుంది. రాంకీ, జగతి కేసులో రూ. 143.7 కోట్ల ఆస్తుల అటాచ్‌మెంట్‌ చేస్తూ జనవరి 7న ఈడీ నోటీసు జారీ అయింది. ఓఎంసీ కేసులో గాలి, సంస్థల ఆస్తుల అటాచ్‌మెంట్‌పై మార్చి 7న న్యాయప్రాధికార సంస్థ విచారణ చేపట్టనుంది. ఓఎంసీ కేసులో రూ.750 కోట్ల ఆస్తులు అటాచ్‌ చేస్తూ గతంలో గాలి జనార్థన్‌రెడ్డి, సంస్థలకు ఈడీ నోటీసులు జారీ అయ్యాయి.