ఆస్పత్రిలో అగ్నిప్రమాదం…అప్రమత్తం అయిన సిబ్బంది

న్యూఢిల్లీ,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): ఢిల్లీలోని గ్రేటర్‌ నోయిడాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. నోయిడా సెక్టార్‌ 12లోని మెట్రో ఆస్పత్రిలో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆస్పత్రి వద్దకు చేరుకున్న 12 ఫైరింజన్లు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఆస్పత్రి లోపల చిక్కుకున్న వందలాది మంది రోగులను బయటకు తీసుకొచ్చేందుకు పోలీసులు, అధికారులు యత్నిస్తున్నారు. కిటికీలను పగులగొట్టి రోగులను బయటకు తీసుకువచ్చారు. ఆస్పత్రిలోని మొదటి అంతస్తులో అగ్నిప్రమాదం సంభవించినట్లు పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.