ఇంగ్లాండ్‌కు ధీటుగా భారత్

india-england-test-matchసౌరాష్ట్ర క్రికెట్ స్టేడియంలో గురువారం మరో రెండు శతకాలు నమోదయ్యాయి. రెండో రోజు ఆటలో ఇద్దరు, మొత్తం మీద ముగ్గురు బ్యాట్స్‌మెన్ సెంచరీలు సాధించడంతో, భారత్‌తో ఇక్కడ జరుగుతున్న మొదటి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ 537 పరుగుల భారీ స్కోరును నమోదు చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్, రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టం లేకుండా 63 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ భారీ స్కోరుకు భారత ఓపెనర్లు ధీటైన జవాబు ఇచ్చే దిశగా ముందడడు వేశారు. తొలి టెస్ట్‌లో రెండో ఆట ముగిసే సమయానికి వికెట్లేమీ నష్టపోకుండా భారత్‌ 63/0 స్కోర్‌ సాధించింది. గౌతమ్‌ గంభీర్‌ 28, మురళీ విజరు 25 పరుగులతో అర్థసెంచరీను జట్టు ఖాతాలో నమోదు చేశారు. 311/4 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు బ్యాటింగ్‌ ఆరంభించిన ఇంగ్లాండ్‌ 537 పరుగులు భారీ స్కోర్‌ వద్ద ఆలౌట్‌ అయ్యింది. భారత్‌ పర్యటనలో ఇంగ్లాండ్‌కు ఇది మూడో భారీ స్కోర్‌. 99 పరుగుల నాటౌట్‌గా బరిలో దిగిన మొయిన్‌ అలీ సెంచరీ పూర్తి చేశాడు. అనంతరం 117 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద ఐదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఉమేష్‌ యాదవ్‌ బౌలింగ్‌లో సాహకు క్యాచ్‌ ఇచ్చి అవుటయ్యాడు. 3 సున్నాల తర్వాత స్టోక్స్‌ సెంచరీ…..భారత్‌పై వరుసగా మూడు ఇన్నింగ్స్‌ల్లో సున్నాకే అవుటైన బెన్‌ స్టోక్స్‌ సెంచరీతో సత్తా చాటాడు. ఇతని సహాయంతో ఇంగ్లాండ్‌ 500 పరుగుల మార్క్‌ను దాటింది. చివల్లో అన్సారీ 32 పరుగుల భాగస్వామ్యంతో పర్యాటక జట్టుకు కొండంత అండగా మారింది.

తాజావార్తలు